బాలీవుడ్ స్టార్స్ పై మహారాష్ట్ర పోలీస్ రియాక్షన్ వైరల్!

ఇటీవల మన దేశంలో నెలకొన్న ఉద్రిక్తకర పరిస్థితులు కోసం అందరికీ తెలిసిందే. అయితే ఆ దారుణ ఘటన అలాగే భారత్ మరియు పాకిస్తాన్ నడుమ యుద్ధం విషయంలో మన సౌత్ నుంచి అనేకమంది స్టార్స్ గళం విప్పారు. కానీ బాలీవుడ్ నుంచి మాత్రం ఏ బిగ్ స్టార్ హీరో కానీ హీరోయిన్ కానీ మాట్లాడకపోవడం అనేది నెటిజన్స్ కి ఆగ్రహం తెప్పించింది. హిందీ హీరోస్ లో ఒక్క అక్షయ్ కుమార్ మినహా ఎవరూ పెద్దగా స్పందించలేదు.

మరి ఇలా స్పందించకుండా ఉన్న హీరోలు అలాగే హీరోయిన్స్ పై మహారాష్ట్ర పోలీస్ వారి రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షారుఖ్, అమీర్, రణ్వీర్ ఇంకా రణబీర్ నుంచి అలియా భట్, దీపికా పదుకోణ్ వరకు అందరినీ ట్రోల్ చేసే విధంగా చేసిన పోస్ట్ ఇపుడు వైరల్ గా మారుతుంది. వారి అందరి ఏఐ ఫోటోలు కలిపి పెట్టి డియర్ సెలబ్రెటీస్, ఇప్పుడు అంతా సేఫ్ గా మారింది.

మళ్ళీ మీ ఇంస్టాగ్రామ్ లలోకి నెమ్మదిగా రావచ్చు. మీ ఇంటర్నేషనల్ ఫ్యాన్ బేస్ ని ఇక అప్సెట్ చేయాల్సిన పని లేదు. బాలీవుడ్ వాయిస్ ఎక్కడ? అంటూ చివరి లైన్ లో డిజైన్ చేసిన పోస్టర్ ఇపుడు సోషల్ మీడియాలో నార్త్ ఆడియెన్స్ లో వైరల్ గా మారింది. ఈ స్పందించని బాలీవుడ్ స్టార్స్ కి ఇండియన్ ఆడియెన్స్ కి అందించే వసూళ్లు కావాలి కానీ ఇలాంటి సమయాల్లో మాత్రం ఒక్కరు కూడా స్పందించరు వారికి కరెక్ట్ కౌంటర్ మహారాష్ట్ర పోలీస్ లు ఇచ్చారు అంటూ విమర్శలు చేస్తున్నారు.

Exit mobile version