‘సర్కారు వారి పాట’ సాంగ్స్ పై క్లారిటీ !

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. మహేష్ సినిమా కావడం, అంచనాలు భారీగా ఉండటంతో తమన్ పై చాలా ఒత్తిడి ఉంది.
అయితే యూనిట్ వర్గాల నుండి వచ్చిన వార్త ఏమిటంటే, ఈ చిత్రానికి ఎలాంటి సంగీతం అవసరం, తాను ఎలాంటి సాంగ్స్ కంపోజ్ చేయాలనే విషయంలో తమన్ చాలా స్పష్టంగా ఉన్నాడట. ఈ చిత్రం కోసం మాస్ మరియు క్లాస్ సాంగ్స్ ను తమన్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రతి పాట మరొ పాట కు ప్రత్యేకమైన భిన్నంగా ఉంటుందట.

అయితే ఈ సినిమా ఇంతకీ ఏ అంశం పై ఉండనుంది ? టైటిల్ ను బట్టి రాజకీయ అంశాల పై ప్రధానంగా సినిమా సాగుతుందని అర్ధమవుతుంది. అలాగే సూపర్ స్టార్ కోసం పరశురామ్ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను రాశారని అలాగే ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓ రొమాన్స్ ట్రాక్‌ కూడా ఉందని, చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్‌ గా నటించనున్నారని తెలుస్తోంది.

ఇక ‘సర్కారు వారి పాట’ సినిమాలో మెయిన్ థీమ్ గురించి మహేష్ ఇటీవలే స్పందిస్తూ.. ‘ఈ సినిమా స్ట్రాంగ్ మెసేజ్ తో సాగే ఫుల్ ఎంటర్ టైనర్. నిజంగా ఈ సినిమా పై నేను చాల ఆసక్తిగా ఉన్నాను’ అని తెలిపారు. ఈ మాటలను బట్టి పై కథాంశం నిజమేనేమో అనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి.

Exit mobile version