రెజీనా ప్లేస్ లో తాప్సీ నటించబోతుందా ?

రెజీనా ప్లేస్ లో తాప్సీ నటించబోతుందా ?

Published on Jan 15, 2020 12:00 AM IST

ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఇటీవలే కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’ని తెలుగులోకి ‘ఓ బేబీ’ పేరుతో రీమేక్ చేసి గ్రాండ్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో సురేష్ ప్రొడక్షన్స్ మరొక కొరియన్ చిత్రం ‘మిడ్ నైట్ రన్నర్స్’ను కూడా రీమేక్ చేసే చేయాలని అనుకుంటున్నారు. ఇదొక యాక్షన్ కామెడీ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది. ఇందులో ప్రధాన పాత్రదారులుగా రెజీనా, నివేత థామస్ నటిస్తారని కొన్ని రోజుల క్రితం వార్తలు కూడా వచ్చాయి.

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం రెజీనా ప్లేస్ లో తాప్సీ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రీమేక్ కోసం దర్శకుడిగా సుధీర్ వర్మను అనుకుంటున్నారట. సుధీర్ వర్మ గత చిత్రం ‘రణరంగం’ అంచనాలను అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఆయనకు ఈ రీమేక్ అవకాశం రావడం మంచిదనే అనుకోవచ్చు. అయితే ఈ చిత్రంపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

తాజా వార్తలు