దేశంలో కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలలో తమిళనాడు రెండవ స్థానంలో ఉంది. అక్కడ కరోనా వైరస్ కేసులు వేలల్లో ఉన్నాయి. ఇక చెన్నై నగరంలో కూడా కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈనేపథ్యంలో చెన్నై అంత సేఫ్ కాదని భావించిన శృతి హాసన్ హైదరాబాద్ చేరుకున్నారట. మొత్తంగా తన టీమ్ తో హైదరాబాద్ లో దిగిన శృతి హాసన్ ఓ ఖరీదైన ఇండిపెండెంట్ హౌస్ అద్దెకు తీసుకున్నారట.
అలాగే ఆమె మేజర్ ప్రాజెక్ట్స్ క్రాక్ మరియు వకీల్ సాబ్ షూటింగ్స్ లో పాల్గొనడానికి కూడా హైదరాబాద్ అనువైనదిగా భావించి శృతి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. వకీల్ సాబ్ మూవీలో శృతి హాసన్ పార్ట్ చిత్రీకరించాల్సి ఉంది. పవన్ మరియు శృతి హాసన్ పై ఓ సాంగ్ కూడా దర్శకుడు ప్లాన్ చేశారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదాపడగా త్వరలో తిరిగి ప్రారంభం కానుంది.