ప్రభాస్ 21 కు ఈ స్థాయి బడ్జెట్టా..?


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత నుంచి చేపడుతున్న ఒక్కో ప్రాజెక్ట్ మామూలు రేంజ్ లో ఉండట్లేదని చెప్పాలి. ఆ సినిమాతో వచ్చిన స్టార్డం ను కూడా అంతే స్థాయిలో మైంటైన్ చెయ్యడానికి కాస్త లేట్ అయినా డార్లింగ్ మాత్రం గట్టిగానే కష్టపడుతూ వస్తున్నారు.

అలా ఇప్పుడు ప్రభాస్ రెండు భారీ ప్రాజెక్టులను చేస్తున్నారు. వీటిలో ఒకటి దర్శకుడు రాధా కృష్ణతో ఇప్పటికే జరుగుతుండగా మరొకటి దీని తర్వాత యువ దర్శకుడు నాగశ్విన్ తో చెయ్యనున్నారు. ఈ ప్రాజెక్ట్ రీసౌండ్ మాత్రం కాస్త గట్టిగానే వినిపించనున్నట్టు తెలుస్తుంది.

ఎందుకంటే ఈ చిత్రానికి భారీ మొత్తంలో 300 కోట్లుకు పైగా బడ్జెట్ ఉంటుందని షాకింగ్ ఫిగర్ బయటకొచ్చింది. అలాగే ఈ చిత్రం ప్లాట్ లైన్ పై కూడా చాలానే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి వీటిపై ఒక సరైన క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version