‘కన్నప్ప’ ప్రీరిలీజ్ డేట్, వేదిక ఖరారు.. ఎక్కడంటే!

టాలీవుడ్ డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా పాన్ ఇండియా లెవెల్లో అనేకమంది అగ్రతారలు నటించిన భారీ పాన్ ఇండియా చిత్రమే “కన్నప్ప”. ట్రైలర్ తో మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు గ్రాండ్ ప్రీరిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంది. ఈ జూన్ 21న సినిమా ప్రీరిలీజ్ జరగనుంది అని ఆల్రెడీ సమాచారం వచ్చింది. అయితే ఇపుడు అధికారికంగా డేట్ కన్ఫర్మ్ అవ్వడమే కాకుండా మేకర్స్ వేదిక కూడా కన్ఫర్మ్ చేశారు.

హైదరాబాద్ లో ఈ జూన్ 21న ఫిలిం నగర్, జే ఆర్ సి కన్వెన్షన్ లో చేస్తున్నట్టుగా తెలిపారు. ఇక ఈ ఈవెంట్ కి నటీనటులు అక్షయ్ కుమార్, మోహన్ లాల్ అలాగే మోహన్ బాబు, కాజల్ లు హాజరు కానున్నారట. ఇక ప్రభాస్ కూడా దాదాపు హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై మాత్రం ఫ్యాన్స్ కి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి స్టీఫెన్ డేవెస్సి సంగీతం అందించగా 24 ఫ్రేమ్స్ వారు నిర్మాణం వహించగా ఈ జూన్ 27 న రిలీజ్ కి సిద్ధం అవుతుంది.

Exit mobile version