టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి ‘మహా సముద్రం’ అనే సినిమా చేస్తోనట్లు రీసెంట్ గా అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. శర్వానంద్ తన కెరీర్ లో గమ్యం, ప్రస్థానం తరువాత మళ్ళీ అలాంటి బలమైన పాత్రను ఈ సినిమాలోనే చేస్తున్నాడని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కాగా తాజాగా ఈ సినిమాలో శర్వానంద్ క్యారెక్టర్ కు సంబందించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ హీరో అనే ఇమేజ్ ఉన్న శర్వానంద్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పైగా ఈ చిత్రంలో ఇంట్రస్టింగ్ ప్రేమకథ కూడా ఉందని.. సినిమాలో హీరోయిన్ పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా కూడా ఉంటుందట. ఇక కరోనా హడావుడి ముగిసాక ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నారు. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా మహాసముద్రం చిత్రం తెరకెక్కనుందని సమాచారం. అలాగే ఈ సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది.