సర్కారు వారి పాట మేకర్స్ రిస్క్ ఎందుకు అనుకుంటున్నారట.

సర్కారు వారి పాట మేకర్స్ రిస్క్ ఎందుకు అనుకుంటున్నారట.

Published on Jun 12, 2020 4:47 PM IST

మహేష్ సర్కారు వారి పాట మూవీకి కూడా కరోనా ఎఫెక్ట్ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ లో మొదలు పెట్టాలని మేకర్స్ మొదట ప్లాన్ చేశారు. ఐతే ఆ నిర్ణయాన్ని వాళ్ళు వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తుంది. మరో మూడు నెలలు వాయిదా వేస్తూ డిసెంబర్ లో మూవీ షూట్ మొదలుపెడదాం అని అనుకుంటున్నారట. ఈ నిర్ణయం వెనుక కారణం కరోనా ప్రభావమే అని తెలుస్తుంది. లాక్ డౌన్ సడలింపుల అనంతరం దేశంలో కరోనా వైరస్ రోగుల సంఖ్య పెరిగిపోయింది.

దీనితో పాటు షూటింగ్స్ మొదలుపెట్టినా అనేక ఆంక్షల మధ్య నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సర్కారు వాటి పాట దర్శక నిర్మాతలు రిస్క్ ఎందుకు, వైరస్ ప్రభావం తగ్గాక ప్రశాంతంగా డిసెంబర్ మొదటివారంలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారట. దీనితో మహేష్ సినిమా మరింత లేటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సర్కారు వారి పాట మూవీని దర్శకుడు పరుశురాం తెరకెక్కిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు