లేటెస్ట్ తెలుగు సినిమా దగ్గర వచ్చి భారీ సక్సెస్ అయ్యిన చిత్రాల్లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” కోసం తెలిసిందే. ఈ సంక్రాంతి వార్ ని కంప్లీట్ గా వన్ సైడ్ చేసేసినట్టుగా ఈ సినిమా రన్ సెన్సేషనల్ లెవెల్లో సాగిస్తుంది. అయితే ఈ సినిమా భారీ సక్సెస్ నేపథ్యంలో చిత్ర యూనిట్ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకొని భగవంతుని ఆశీస్సులు తీసుకున్నారు.
నిర్మాత దిల్ రాజు, శిరీష్ అలాగే హీరోయిన్స్ మీనాక్షి, ఐశ్వర్య రాజేష్ సహా బుల్లిరాజు ఫేమ్ రేవంత్ ఇంకా తమ టీం అందరి కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనీల్ రావిపూడి అంతా కలిసి వెళ్లి తమ సినిమా విజయంతో వేంకటేశుని ఆశీస్సులు తీసుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా ఇపుడు 200 కోట్ల క్లబ్ లోకి చేరనుండగా ఈ ఆల్రెడీ వెంకీ మామ కెరీర్లోనే రికార్డు గ్రాస్ ని ఈ చిత్రం సెట్ చేసి ఊహించని నంబర్స్ దిశగా దూసుకెళ్తుంది. మరి దిల్ రాజు ఇదే వేంకటేశ్వర స్వామి పేరిట శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పైనే సినిమాని నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
Touched by divinity and driven by love ❤️????????
Team #SankranthikiVasthunam sought the divine blessings of Lord Venkateswara Swamy at Tirupati ✨
The team will be interacting with the media at Jayasyam Theatre about #BlockbusterSankranthikiVasthunam ????
IN CINEMAS NOW ????
Victory… pic.twitter.com/IA0zmUPxOG
— Sri Venkateswara Creations (@SVC_official) January 19, 2025