సాయి ధరమ్ తేజ్ నూతన చిత్ర ప్రారంభోత్సవం కన్నుల పండుగగా జరిగింది పలువురు నటులు పరిశ్రమ పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చిరంజీవి,పవన్ కళ్యాణ్, కే రాఘవేంద్ర రావు,అల్లు అర్జున్ ,ఎస్ ఎస్ రాజమౌళి, సుకుమార్,వంశీ పైడిపల్లి, రామానాయుడు, దిల్ రాజు, అల్లు అరవింద్, బన్నీ వాస్, ఏ ఎస్ రవికుమార్ చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవి క్లాప్ కొట్టగా పవన్ కళ్యాణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు కే రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించారు. కేంద్ర టూరిజం మంత్రిగా ఎంపిక అయిన తరువాత చిరంజీవి పాల్గోన్న మొదటి కార్యక్రమం కావడంతో అందరి కళ్ళు ఈ కార్యక్రమం మీద ఉంది. ప్రారంభోత్సవం ముగిసాక చిరంజీవి మీడియా తో మాట్లాడుతూ “సాయి ధరమ్ తేజ్ నా మేనల్లుడే కాదు నాకు కొడుకు లాంటి వాడు, కష్టపడే తత్వం తనది భవిష్యత్తులో మంచి నటుడు అవుతాడు గీతా ఆర్ట్స్ కి మెగా ఫ్యామిలీ కి ఉన్న బంధం తెలిసిందే రామ్ చరణ్ రెండవ చిత్రం ఈ బ్యానర్ లో చేశాడు ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కూడా తన రెండవ చిత్రాన్ని ఈ బ్యానర్ లో చెయ్యడం చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న మొదలు పెట్టనున్నారు వచ్చే ఏడాది మే 10న చిత్ర విడుదల చెయ్యాలని నిర్మాతలు అనుకుంటున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.