‘ఆర్ఆర్ఆర్’ ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్ అందుకుంది. ఎన్టీఆర్ – చరణ్ హీరోలుగా వచ్చిన ఈ సినిమా మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటింది. తెలుగు సినిమా స్థాయిని రాజమౌళి మొత్తమ్మీద పెంచాడు. ఈ నేపథ్యంలో లండన్లోని ప్రతిష్ఠాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘ఆర్ఆర్ఆర్ లైవ్ కాన్సర్ట్’ నిర్వహించారు. ఎం.ఎం. కీరవాణి తన ప్రదర్శనతో అతిథులను మంత్రముగ్దుల్ని చేశారు. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ – చరణ్ లతో పాటు రాజమౌళి కూడా పాల్గొన్నాడు.
ఐతే, ఈవెంట్ సందర్భంగా ఎన్టీఆర్కి ముందస్తుగా రామ్చరణ్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. దీంతో అభిమానులు కేకలతో హోరెత్తించారు. పైగా అక్కడి అతిథులు, సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ హీరోల ఫుల్ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తమ్మీద ఈ స్టార్ హీరోల ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అన్నట్టు ప్రస్తుతం రాజమౌళి, మహేశ్ బాబు హీరోగా ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు.