రూట్ మారుస్తున్న డైరెక్టర్స్ ?

రూట్ మారుస్తున్న డైరెక్టర్స్ ?

Published on Jun 21, 2020 7:55 PM IST

‘మహర్షి’ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనుకున్నా ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి ఓ వెబ్ సిరీస్‌ చేయడానికి ఓకే చెప్పారట. అల్లు అరవింద్ తన ఓటిటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ కోసం డిజిటల్ కంటెంట్‌ ను రూపొందించడానికి చాలా మంది దర్శకులతో ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వంశీ పైడిపల్లి చేత వెబ్ సిరీస్ చేయాలని ప్లాన్ చేసాడట.

అలాగే డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఈ లాక్ డౌన్ లో వెబ్ సిరీస్ కోసం ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాసిన్నట్లు తెలుస్తోంది. మరి పూరి ఏ ప్లాట్ ఫామ్ కి వెబ్ సిరీస్ చేస్తాడో చూడాలి. మరో స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే రాహుల్ రవీంద్రన్ కూడా ఓ వెబ్ సిరీస్ చేయనున్నాడు. ఇంకా కొంతమంది దర్శకులు ఓటిటీ ప్లాట్ ఫామ్స్ పై ఇంట్రస్ట్ గా ఉన్నారు. మొత్తానికి డైరెక్టర్స్ అందరూ రూట్ మారుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు