లేటైనా థియేటర్స్ లోనే దిగుతా అంటున్న స్టార్ హీరో

లేటైనా థియేటర్స్ లోనే దిగుతా అంటున్న స్టార్ హీరో

Published on Jun 12, 2020 9:55 PM IST


హీరో రానా దగ్గుబాటి లేటెస్ట్ మూవీ అరణ్య. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ లోనే ఈ చిత్రం విడుదల కావాల్సివుండగా లాక్ డౌన్ కారణంగా వాయిదాపడింది. ఐతే ఈ మూవీ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో విడుదల చేస్తున్నారని వార్తలు రావడం జరిగింది. ఓ టి టి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాకు భారీ ధర ఆఫర్ చేశారని, దీనితో అరణ్య నెట్ ఫ్లిక్స్ లో విడుదల అవుతుందని కథనాలు వెలువడ్డాయి.

ఐతే ఈ న్యూస్ లో ఎటువంటి నిజం లేదని హీరో రానా దగ్గుబాటి తేల్చి చెప్పారు. కొంచెం లేటైనా అరణ్య మూవీ థియేటర్స్ లోనే విడుదల అవుతుందని ఆయన స్పస్టత ఇవ్వడం జరిగింది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో జీవారణ్యం కాపాడే అడవి తెగ మనిషిగా రానా నటిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ మరియు తమిళంలో ఈ చిత్రం విడుదల కానుంది. దర్శకుడు ప్రభు సోలొమన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు