లాక్ డౌన్ కారణంగా ప్రపంచం స్తంభించి పోయింది. అన్ని పరిశ్రములు మూతపడడంతో పాటు, లాక్ డౌన్ నిబంధనల కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో టెలివిజన్ ఛానెల్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే ప్రణాళికలు వేస్తున్నారు. ఒకప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ షోస్ మరియు కార్యక్రమాలు పునఃప్రసారం చేస్తున్నారు.
కాగా ఒకప్పటి క్రేజీ టివి సీరియల్ రామానంద్ సాగర్ రామాయణం పునఃప్రసారం చేస్తున్నారు. కొద్దిరోజులుగా ఈ సీరియల్ డి డి నేషనల్ ఛానెల్ లో ప్రసారం అవుతుంది. కాగా గత నెల 16న ఈ టీవీ షో ఏకంగా 77 మిలియన్స్ అనగా 7.7 కోట్ల మంది వీక్షించారు. ఇది ప్రపంచ రికార్డు కావడం గమనార్హం. ప్రముఖ హాలీవుడ్ షోలైన ది బిగ్ బ్యాంగ్ థియరీ(17 మిలియన్స్), గేమ్ ఆఫ్ థ్రోన్స్(18.5 మిలియన్స్) సాధించిన రికార్డ్స్ రామాయణం చెరిపివేసింది.