మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘విశ్వంభర’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ పూర్తి సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల ‘రామ రామ’ అనే ఫస్ట్ సింగిల్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. ఇక తాజాగా ఈ పాట యూట్యూబ్లో 25 మిలియన్ వ్యూస్ మార్క్ను క్రాస్ చేసింది. దీంతో ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతోంది.
ఇక ఈ సినిమాలో అందాల భామ త్రిష హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.