‘పెద్ది’పై హైప్ పెంచేసిన చరణ్.. సోషల్ మీడియా షేక్!

‘పెద్ది’పై హైప్ పెంచేసిన చరణ్.. సోషల్ మీడియా షేక్!

Published on May 14, 2025 12:30 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో ‘పెద్ది’ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిస్తున్నారు. అయితే, ఈ సినిమాపై రామ్ చరణ్ తాజాగా కొన్ని కామెంట్స్ చేశాడు. లండన్‌లో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వెళ్లినా చరణ్, అక్కడి అభిమానులతో పెద్ది సినిమా విశేషాలను పంచుకున్నాడు.

ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తయిందని.. పెద్ది సినిమా రంగస్థలం చిత్రానికంటే పెద్దదిగా ఉంటుందని ఆయన అన్నారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ది ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు చరణ్ ఈ సినిమాపై ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడంటే.. ఇక ఈ సినిమా పూర్తయితే, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తాడా అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా శివ రాజ్‌కుమార్, జగపతిబాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు