‘పెద్ది’ మూవీపై రామ్ చరణ్ క్రేజీ కామెంట్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర రామ్ చరణ్ మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాను రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా మేకర్స్ రూపొందిస్తున్నారు.

అయితే, ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తాజాగా వెల్లడించారు. ఆయన ప్రస్తుతం లండన్‌లో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన మాట్లాడుతూ పెద్ది సినిమాపై కొన్ని అప్డేట్స్ ఇచ్చారు.

పెద్ది చిత్రం ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తయిందని.. ఈ సినిమా ‘రంగస్థలం’ చిత్రానికంటే కూడా బాగుంటుందని రామ్ చరణ్ తెలిపారు. దీంతో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్‌ను రాబడుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version