కరోనా కష్టాలు..వింత గెటప్ లో స్టార్ హీరోయిన్

కరోనా కష్టాలు..వింత గెటప్ లో స్టార్ హీరోయిన్

Published on Jun 12, 2020 11:22 AM IST

కరోనా కష్టాలు దేశంలో ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్యులు, సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా దీని బారిన పడుతున్నారు. ఆదమరుపుగా ఉంటే ఈ కరోనా ఏ రూపంలోనైనా దాడి చేసే అవకాశం ఉంది. కాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముంబై విమానాశ్రయంలో వింత గెటప్‌తో దర్శనిమిచ్చింది. 95 మాస్క్, గ్లోవ్స్‌, అరికాలి నుంచి తల వరకు మొత్తం దుస్తులు ధరించింది. ముంబై నుంచి ఢిల్లీకి విమానంలో ప్రయాణమైంది. బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసమే రకుల్ ఢిల్లీ వెళుతున్నట్టు సమచాారం.

ముంబై, ఢిల్లీ నగరాలలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో ఆమె పకడ్బందీ జాగ్రత్తలతో బయటికి వచ్చారు. అలా తనను తానూ కాపాడు కుంటూ సమాజానికి కూడా మేలు చేయడం మెచ్చుకోదగ్గ విషయమే. ఇక రకుల్ ప్రస్తుతం తెలుగులో నితిన్ కి జంటగా ఓ చిత్రంలో నటిస్తుంది. తమిళంలో కమల్-శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు సినిమాలో కూడా ఓ కీలక రోల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు