శేఖర్ కపూర్ కామెంట్స్ తో మేఘాల్లో రాజమౌళి

శేఖర్ కపూర్ కామెంట్స్ తో మేఘాల్లో రాజమౌళి

Published on Oct 13, 2012 1:59 PM IST

ఎస్ ఎస్ రాజమౌళిని “మఖ్ఖీ” చిత్రం మరో స్థాయికి తీసుకెళ్ళింది. ఈ చిత్రం ఇప్పటికే బాలివుడ్లో విమర్శకుల మెప్పు పొందింది. ఈ చిత్రం చూసిన వాళ్ళంతా రాజమౌళి పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. వీటన్నింట్లో శేఖర్ కపూర్ గారి కామెంట్స్ రాజమౌళిని ఆనందంలో ముంచెత్తాయి. “మిస్టర్ ఇండియా”,”బందిట్ క్వీన్” వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈ దర్శకుడు భారతదేశంలో ఉత్తమ దర్శకుల్లో ఒకరు. “ఈగ చిత్రం నాకు చాలా ఇచ్చింది సంపద,పేరు,బాలివుడ్ అవకాశాలు వీటన్నింటికన్నా ముఖ్యంగా శేఖర్ కపూర్ తో స్నేహం” అని రాజమౌళి ట్వీట్ చేశారు. వీళ్ళు ఇద్దరు కలిసి చాలా సేపు గడిపినట్టు తెలుస్తుంది “రాజమౌళితో చాలా సేపు మాట్లాడాను చిత్రాల గురించి అదొక అద్భుతమయిన అనుభవం చాలా మంది ప్రయత్నించారు కాని రాజమౌళి నన్ను తిరిగి చిత్రాలను తెరకెక్కించడానికి ఒప్పించారు. ఆయనకి చిత్రాల మీద ఉన్న ఆసక్తి నన్ను ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది” అని శేఖర్ కపూర్ అన్నారు. ఇది చూస్తుంటే రాజమౌళి “మఖ్ఖీ” చిత్రానికి ఎటువంటి స్పందన వస్తుంది చెప్పవచ్చు.

తాజా వార్తలు