మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన అలనాటి సూపర్ హిట్ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం మళ్ళీ ఇపుడు ఏకంగా 35 ఏళ్ళు తర్వాత తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు 2డి సహా 3డిలో కూడా వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా విశేషాలు పంచుకుంటూ మేకర్స్ మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూని ప్లాన్ చేసుకోగా ఇందులో పార్ట్ 2 కోసం జరిగిన సంభాషణలో మెగాస్టార్ సహా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాటలతో పాటుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా మాట్లాడ్డం జరిగింది.
అయితే సీక్వెల్ కి మాత్రం దర్శకునిగా బాధ్యతని వారంతా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ ని అప్పజెప్పారు. మరి ఈ సమయంలో దర్శకేంద్రుడు ఫన్ ఛాలెంజ్ ని నాగశ్విన్ కి అందించారు. నీ ఘట్టానికి నా ఘట్టానికి పోటీ నాగశ్విన్ అంటూ చేసిన ఈ ఛాలెంజ్ మంచి ఆసక్తిగా మారింది. మరి ఈ అవైటెడ్ సీక్వెల్ భాద్యతలు దాదాపు నాగ్ అశ్విన్ మీదే పడ్డాయి. ఇక అధికారికంగా ఆ బిగ్ అనౌన్సమెంట్ ఒకటి రావడం మాత్రం తరువాయి అని చెప్పాలి.