టాలీవుడ్ లో మాస్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్. రామ్ తో తీసిన “ఇస్మార్ట్ శంకర్” తో మైండ్ బ్లోయింగ్ కం బ్యాక్ హిట్ అందుకున్న పూరి ఇప్పుడు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఓ పాన్ ఇండియన్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి గాను బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కూడా ఒక భాగం అన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం పూరి విజయ్ తో సినిమా చేసాక బాలీవుడ్ లో మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
అక్కడి ఓ ఇద్దరు స్టార్ హీరోలతో మరో రెండు సినిమాలు తీయనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి కారణం కరణ్ జోహార్ తో ఇది వరకే మూడు సినిమాలు చేస్తా అని కమిట్ అవ్వడమే అని అందులో భాగంగానే విజయ్ తో సినిమా తర్వాత మరో రెండు సినిమాలు పూరి అక్కడే చేయనున్నారని ఇప్పుడు టాక్.