‘తమ్ముడు’ టికెట్ ధరలపై తేల్చేసిన దిల్ రాజు!

‘తమ్ముడు’ టికెట్ ధరలపై తేల్చేసిన దిల్ రాజు!

Published on Jun 26, 2025 8:00 PM IST

మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా లయ కీలక పాత్రలో హీరోయిన్స్ వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ ల కలయికలో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “తమ్ముడు”. నితిన్ గత చిత్రం రాబిన్ హుడ్ అనుకున్న రేంజ్ లో రాణించకపోయినప్పటికీ ఈ సినిమా కంటెంట్ మాత్రం ప్రామిసింగ్ గా కనిపించడంతో డీసెంట్ బజ్ అయితే నెలకొంది. ఇక ఈ సినిమా విషయంలో నిర్మాత దిల్ రాజు చాలా అంశాలని రియాలిటీకి దగ్గరగా తీసుకున్నారు.

ట్రైలర్ కి ఆర్గానిక్ వ్యూస్ నుంచి ఇపుడు టికెట్ ధరల విషయంలో కూడా ఎలాంటి ముందడుగు తీసుకోలేదు. దీనితో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తన సినిమా ఎలాంటి టికెట్ ధరల హైక్స్ లేకుండానే మామూలు ధరలతోనే విడుదల అవుతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సో తమ్ముడు రిలీజ్ విషయంలో మాత్రం ఆడియెన్స్ కి ఎలాంటి భారం ఉండదు అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా జూలై 4న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు