మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘వార్-2’ చిత్రాన్ని రిలీజ్కు రెడీ చేసిన ఎన్టీఆర్, తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ కొత్త అప్డేట్ సినీ సర్కిల్స్లో వినిపిస్తోంది.
ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ స్క్రిప్టులో మార్పులు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, సాధారణంగా తన కథలో ఎలాంటి మార్పులు చేయని ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ని దృష్టిలో పెట్టుకుని, ఆయనతో సినిమాను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లే క్రమంలో స్క్రిప్టులో కొన్ని మార్పులు చేస్తున్నాడేమో అని కొందరు కామెంట్ చేస్తున్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.
ఈ సినిమా స్క్రిప్టులో ఎలాంటి మార్పులు లేవని.. కొన్ని డైలాగ్ వర్షెన్ వరకే ఈ మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మార్పులను ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్తో పాటు ఉంటూ పరిశీలిస్తున్నాడట. ‘సలార్’లో జరిగిన చిన్న తప్పులు ప్రశాంత్ నీల్ ఈసారి ఎలాగైనా అవాయిడ్ చేయాలని చూస్తున్నాడట. అందుకే షూటింగ్ దశలోనే స్క్రిప్టుపై పక్కా ప్లానింగ్ను అమలు చేస్తున్నాడట. మరి తారక్ కోసం ప్రశాంత్ నీల్ ఎలాంటి మార్పులతో ఈ సినిమాను అందిస్తాడా అనేది చూడాలి.