వేసవిలో ‘వర్షం’.. రీ-రిలీజ్‌తో వస్తానంటున్న ప్రభాస్

వేసవిలో ‘వర్షం’.. రీ-రిలీజ్‌తో వస్తానంటున్న ప్రభాస్

Published on Apr 23, 2025 2:00 AM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజా సాబ్’, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ చిత్రాలను తెరకెక్కిస్తున్నాడు. ఇక తమ అభిమాను హీరోను బిగ్ స్క్రీన్‌పై ఎప్పుడు చూస్తామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, వారందరి కోసం ప్రభాస్ ఓ రీ-రిలీజ్ మూవీతో రాబోతున్నాడు.

ప్రభాస్ కెరీర్‌లో తొలి బిగ్గెస్ట్ హిట్ మూవీగా ‘వర్షం’ నిలిచింది. దర్శకుడు శోభన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్యూర్ లవ్ స్టోరీగా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మేజర్ అసెట్‌గా నిలిచింది. త్రిష, ప్రభాస్‌ల జోడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేసి ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

మే 23న ‘వర్షం’ చిత్రం రీ-రిలీజ్ కానుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు ప్రొడ్యూస్ చేశారు. మరి ఈ చిత్రం రీ-రిలీజ్‌లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు