బుట్ట బొమ్మ పెద్ద మనసు… కరోనా అరికట్టడంలో అలా భాగమైంది.

బుట్ట బొమ్మ పెద్ద మనసు… కరోనా అరికట్టడంలో అలా భాగమైంది.

Published on May 8, 2020 2:24 PM IST

బుట్ట బొమ్మ పూజ హెగ్డే సామాజిక సేవకై నడుం బిగించింది. కోవిడ్ వైరస్ పై యుద్ధంలో ఓ అడుగు ముందుకు వేసింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అంత కంతకు పెరిగిపోతుంది. దీన్ని అరికట్టడంలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు కూడా దీని బారిన పడడం అందరినీ భయం భ్రాంతులకు గురిచేస్తుంది. మనల్ని వారు కాపాడాలంటే మనం వారిని కాపాడాలి. కానీ వారికి సరైన రక్షణ పరికరాలు లేకపోవడం వలన వారు వైరస్ బారిన పడుతున్నారు.

దీని కోసం వారికి పి పి ఈ (పర్సనల్ ప్రొటెక్టీవ్ ఎక్విప్మెంట్) కిట్స్ అందజేయడం అవసరం. దీని కోసం విరాళాలు పంపవలసిందిగా పూజ హెగ్డే కోరుతున్నారు. www.tring.co.in వెబ్ సైట్ లో లాగిననై తమ విరాళాలు పంపవలసిందిగా ఓ వీడియో సందేశం ద్వారా పూజ హెగ్డే తెలియజేశారు. మీకు తోచినంత సహాయం చేయమన్న పూజ హెగ్డే, విరాళం పంపిన వారి గురించి స్పెషల్ వీడియో ద్వారా తెలియజేస్తాను అన్నారు. ఒక్కొక్క పి పి ఈ కిట్ ధర రూ. 650/- వరకూ ఉండగా ఏపీ మరియు తెలంగాణాలో వైద్య సిబ్బందికి అందజేయాలని సంకల్పంగా పెట్టుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు