ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు సెన్సేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు అట్లీతో చేస్తున్న ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా మొదలైన తర్వాతే ఐకాన్ స్టార్ ని గద్దర్ అవార్డు వరించింది. మరి ఈ అవార్డ్స్ వేడుకలో యంగ్ అండ్ టాలెంటెడ్ నటి నివేతా థామస్ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.
గత ఏడాది తన నుంచి వచ్చిన 35 చిన్న కథ కాదు మంచి హిట్ అయ్యింది. మరి ఈ వేడుకలో పాల్గొన్న నివేత ఐకాన్ స్టార్ తో కలిసి ఓ పిక్ షేర్ చేసుకుంది. ఇద్దరూ మంచి ఛార్మింగ్ లుక్స్ లో కనిపిస్తుండగా ఆ పిక్ కి ఆమె సరస్వతి అండ్ పుష్ప అంటూ క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేయగా ఇది వైరల్ గా మారింది. ఇక నివేతా అయితే ప్రస్తుతానికి మరో సినిమా కమిట్ అయ్యినట్టుగా కనిపించడం లేదు. వీటిపై మరిన్ని డీటెయిల్స్ బయటకి రావాల్సి ఉంది.
Saraswathi and Pushpa #TelanganaGaddarFilmAwards pic.twitter.com/lddovF5OoJ
— Nivetha Thomas (@i_nivethathomas) June 18, 2025