‘8 వసంతాలు’ ప్రీరిలీజ్ ఈవెంట్ హైలైట్స్!

వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన లేటెస్ట్ సినిమానే ‘8 వసంతాలు’. ప్రేక్షకులను అలరించడానికి ఇప్పుడీ సినిమా సిద్ధమౌతోంది. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. అనంతిక సునీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన 8 వసంతాలు సోల్‌ఫుల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మరి ఈ ఈవెంట్ హైలైట్స్ చూస్తే..

ప్రీరిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారు, రవి గారు చాలా అద్భుతమైన వ్యక్తులు. చిన్న సినిమా పెద్ద సినిమాని కాదు… మంచి సినిమానా కాదా అనేది చూస్తారు. ఒక మంచి సినిమా వస్తే చేస్తారనే దానికి నేనే నిదర్శనం. మనిషిని మనిషిగా చూడటం చాలా కష్టం. మైత్రి మూవీ మేకర్స్ మనిషిని మనిషి లాగా చూస్తారు. అందుకే ఇండియాలో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ గా వున్నారు. ఈ సినిమాతో ఒక మంచి నిర్మించారనే పేరు వారికి వస్తుందని ఖచ్చితంగా చెప్పగలను. చాలామంది కొత్తవారికి ఉనికిని ఇచ్చారు. ఇది డబ్బు కంటే చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా మా టీం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మంచి కథ ఉంటే మైత్రిలోకి ఎలాగోలా రావచ్చు. సినిమాకి పని చేసిన నటీనటులకు టెక్నీషియన్స్ కి అందరికీ పేరుపేరు నా ధన్యవాదాలు. అనంతిక ఈ సినిమా చేయడానికి డబ్బు కూడా అక్కర్లేదని చెప్పింది. టాలెంట్ కంటే ఇలాంటి పాషన్ ఉండడం చాలా గొప్ప విషయం. ఒక 17 ఏళ్ల అమ్మాయికి డబ్బు సంపాదించుకోవడం తెలుసు, వద్దు అనుకోవడం తెలుసు. ఇది చాలా గొప్ప విషయం. తను చాలా గొప్ప పెర్ఫార్మర్ అవుతుంది. శుద్ధి అయోధ్య పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమా ఓపెన్ సీక్వెన్స్ మిస్ అవ్వొద్దు. సినిమా అంతా రివర్స్ లో వెళ్తుంది. అందుకే ఓపెనింగ్ సీక్వెన్స్ ఎవరు మిస్ అవ్వద్దు అని కోరుతున్నాను. చాలా మంది కమర్షియల్ సినిమా తీయొచ్చు కదా అంటున్నారు. పెన్ ఓ పదినిమిషాలు పక్కన పెట్టి ఈ ప్రేమ, మనసుకు సంబంధించిన విషయాలు ఎందుకని ఆలోచిస్తే ఎలా ఉంటుందో వారణాసి లో ఫైట్ చూస్తారు. ఇంత బలంగా చెప్పడానికి కారణం ఆలోచన, టీం వర్క్. కమర్షియల్ సినిమా తీయలేక కాదు తీయాలని లేక. నాకు ఆడియన్స్ పై ఎప్పుడూ నమ్మకం వుంది. తప్పకుండా ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారు. సినిమా చూసిన తర్వాత ప్రేమ తత్వం బోధపడుతుంది. ప్రేక్షకుడిగా థియేటర్ కి వెళ్ళిన ప్రేక్షకులు ప్రేమికూలిగా తిరిగివస్తారు. జూన్ 20న తప్పకుండా సినిమా థియేటర్స్ లో చూడాలని కోరుతున్నాను” అన్నారు.

ఇక టాలెంటెడ్ హీరోయిన్ అనంతిక మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. అయోధ్య లాంటి గొప్ప పాత్రలో నన్ను నమ్మిన ఫణింద్ర గారికి ధన్యవాదాలు. ఇప్పటివరకు నాలుగైదు సినిమాలు చేశాను. కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ నా జీవితంలో ఎప్పుడూ లేదు. ఇదంతా ఒక డ్రీమ్ లాగా ఉంది. శుద్ధి లాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ చేస్తానని అని ఎప్పుడూ అనుకోలేదు. ఫణి గారి వల్లే సాధ్యమైయింది. యాక్షన్ ఎమోషన్ లవ్ అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. ఇలాంటి రోల్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అయోధ్య పాత్రకు చాలా డీప్ గా కనెక్ట్ అయ్యాను. ఆడియన్స్ కూడా అలా డీప్ గా కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాను. చాలా స్పెషల్ మూవీ ఇది. మైత్రి లాంటి బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ లో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నప్పటికీ ఈ క్యారెక్టర్ లో నన్ను బిలీవ్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ కి థాంక్యూ. మీ జర్నీలో చాలా సపోర్ట్ చేశారు. విశ్వ గారు చాలా విజువల్స్ ఇచ్చారు. ప్రతి ఫ్రేం ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. జూన్ 20న తప్పకుండా అందరూ వెళ్లి థియేటర్స్ లో సినిమా చూడండి” అని తెలిపింది.

యువ నటుడు రవితేజ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఇది మొదటి ఈవెంట్. మొదటి సినిమా. మా గ్రాండ్ ఫాదర్ దుగ్గిరాల సోమేశ్వరరావు గారు తెలుగు నాటక రంగంలో దిగ్గజం. ఇటివల కాలం చేశారు. ఇందులో నా పెర్ఫార్మెన్స్ ఆయనకి అంకితం. నా ప్రయాణంలో ఎంతగానో సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. మైత్రీ మూవీ మేకర్స్ మేమంతా కొత్త వాళ్ళం అయిన స్టార్స్ ని ఎలా చుసుకుంటారో అలానే చూసుకున్నారు. డైరెక్టర్ ఫణికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఆనంతిక అద్భుతంగా నటించింది. ఆమె నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఫణీంద్ర గారి దర్శకత్వంలోనే మధురమనే ఒక షార్ట్ ఫిలిం నటించాను. దానికి నాకు చాలా గుర్తుకు వచ్చింది. ఇందులో సంజయ్ అనే అద్భుతమైన పాత్ర నమ్మి ఈ పాత్ర ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆ నమ్మకాన్ని ఎలా అయినా నిలబెట్టుకోవాలని ప్రాణం పెట్టి పనిచేశాను. జూన్ 20న అందరూ థియేటర్స్ లో సినిమా చూడాలి” అన్నారు.

మరో నటుడు హను రెడ్డి మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ఫణి గారికి ధన్యవాదాలు. చాలా సపోర్ట్ చేశారు. డీవోపీ చాలా అందంగా చూపించారు. చాలా స్పెషల్ మూవీ ఇది. మా యూనిట్ అందరికీ పేరుపేరునా థాంక్ యూ. తప్పకుండా ఈ సినిమాని థియేటర్ లోనే చూడండి” అన్నారు.

ఏస్ ప్రొడ్యూసర్ రవిశంకర్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ సినిమాకి అనంతిక, ఫణి బిగ్గెస్ట్ పిల్లర్స్. రవి హను కుడా ఎక్స్ట్రార్డినరీగా నటించారు. విజువల్ గా అదిరిపోయింది. చాలా ఎమోషనల్ కంటెంట్ చెప్పాడు ఫణి. ఈ ప్రయత్నం డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని అందరం ఆశిస్తున్నాను. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు . చాలామంది కొత్తవాళ్లు ఉన్నారు. వాళ్ళందరికీ బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి అని కోరుకుంటున్నాను. అనంతిక ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. క్లాసికల్ డాన్స్ మార్సల్ట్స్ రెండు వచ్చిన అమ్మాయి కావాలని ఇండియా మొత్తం వెతికితే ఒక్క అమ్మాయి దొరికింది.. తనే అనంతిక. ఈ సినిమా ఒక అమ్మాయి జర్నీ. ఒక అమ్మాయి జీవితమే 8 వసంతాల. సినిమా కాశ్మీర్ ఊటీ వారణాసి ఆగ్రా ఇలా బ్యూటిఫుల్ లొకేషన్స్ లో తీయడం జరిగింది. జూన్ 20న మీ ముందుకు వస్తోంది. మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం” అని తెలిపారు.

మరో ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. ఇది చాలా డిఫరెంట్ మూవీ. కథ బాగా నచ్చి మేము చేసిన ప్రయత్నం. అందరికీ నచ్చుతుందని నమ్మకం వుంది. చాలా కొత్త టాలెంట్ ఇందులో వర్క్ చేశారు. వాళ్ళందరి కోసం ఈ పెద్ద విజయం సాధించాలి. అందరూ థియేటర్స్ లో సినిమా చూడాలని కోరుతున్నాను” అని అన్నారు.

డైరెక్టర్ నీరజ కోన మాట్లాడుతూ.. “మైత్రి మూవీ మేకర్స్ కి థాంక్యూ. ఈ వేడుకలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది. కంటెంట్ చాలా క్యురియాసిటీ పెంచుతోంది. డైరెక్టర్ ఫణి గారు చాలా పాషన్ తో సినిమా తీస్తారు. ఈ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్’ అన్నారు.

మరో మహిళా డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ.. “మైత్రీ మూవీ మేకర్స్ 100 కోట్లు సినిమా చేసినా పది కోట్ల బడ్జెట్ అయినా అంతే పాషన్ తో సినిమా తీస్తారు. అంత పెద్ద బ్యానర్ 8 వసంతాలు లాంటి యూనిక్ కథలకి ప్లాట్ఫామ్ అవడం అనేది ఆనందంగా ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అనిపిస్తుంది. హేషం చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్టర్ గారు చాలా పాషన్ తో ఈ సినిమా తీశారు అని అర్థమవుతుంది. ఆడియన్స్ కూడా ఆ పాషన్ ఫీల్ అవుతారు . అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్” అని ముగించారు.

Exit mobile version