సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కుబేర’.. అఫీషియల్ రన్ టైం బయటకి!

కోలీవుడ్ స్టార్ ధనుష్ అలాగే టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున, రష్మిక మందన్నా తదితర స్టార్ నటీనటుల కలయికలో మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అవైటెద్క్ చిత్రమే “కుబేర”. దీనిపై మంచి బజ్ ఇపుడు నెలకొంది. అయితే ఇటీవల వచ్చిన ట్రైలర్ కంటే ముందే కుబేర భారీ రన్ టైం తో రాబోతుంది అని ఒక టాక్ ఉంది.

కానీ ఫైనల్ గా అధికారిక క్లారిటీ కుబేర పై వచ్చేసింది. సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మరి సినిమా చూసాక సెన్సార్ యూనిట్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ని అందజేశారు. ఇక దీనితో పాటుగా సినిమా అధికారిక రన్ టైం కూడా దీనితోనే రివీల్ చేశారు. ఈ సినిమా ఇది వరకు మూడు గంటల 15 నిమిషాలు అలా ఉంటుంది అని టాక్ వచ్చింది.

మరి అలా వచ్చినట్టే 3 గంటలకి సినిమాని కట్ చేశారు. ఏకంగా 3 గంటల ఒక్క నిమిషం నిడివితో కుబేర థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇక ఇంతసేపు ఈ సినిమా ఎలాంటి ట్రీట్ ఇస్తుందో తెలియాలి అంటే ఈ జూన్ 20 వరకు ఆగాల్సిందే. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా అమిగోస్ సినిమాస్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు నిర్మాణం వహించారు.

Exit mobile version