ఫోటో మూమెంట్: హనుమాన్ ఆశీస్సులు తీసుకున్న ‘విశ్వంభర’ టీం

ఫోటో మూమెంట్: హనుమాన్ ఆశీస్సులు తీసుకున్న ‘విశ్వంభర’ టీం

Published on Apr 12, 2025 9:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “విశ్వంభర”. చిరు నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న ఫాంటసీ చిత్రం కావడంతో “విశ్వంభర” పై మంచి హైప్ అపుడు నెలకొంది. అయితే మధ్యలో మేకర్స్ కొంత పనులు మళ్ళీ చేయాల్సి వచ్చిన నేపథ్యంలో కొంత ఆలస్యం అయ్యింది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ని నేడు హనుమాన్ జయంతి కానుకగా మేకర్స్ రిలీజ్ చేయగా దీనికి శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ శుభ సందర్భంలో మేకర్స్ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయానికి వెళ్లి హనుమాన్ ఆశీస్సులు తీసుకున్నారు.

ఇలా దర్శకుడు వశిష్ఠ అలాగే సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి, చోటా కే నాయుడు తదితరులు కలిసి సందడి చేసారు. దీనితో అక్కడ నుంచి పిక్స్ వైరల్ గా మారాయి. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు