ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకులు క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణలు తెరకెక్కించిన భారీ చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా అన్ని పనులు పూర్తయ్యి రిలీజ్ కి వస్తుండగా దర్శకుడు జ్యోతి కృష్ణ ఓ బ్యూటిఫుల్ మూమెంట్ ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఇదొక ప్రొఫిషినల్ మెమరీ కాదు లైఫ్ టైం మెమరీ అంటూ తాను తన భార్య కూతురు అలాగే తన తండ్రి ఇంకా సినిమా నిర్మాత ఏ ఎం రత్నం కలిసి కనిపించిన పిక్ ని షేర్ చేసుకున్నారు. జ్యోతి కృష్ణ కూతురు అహానాని పవన్ ఎత్తుకోగా నేడు తన చిన్నారి పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తాను పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. దీనితో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా ఈ జూలై 24న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.