‘ఓజి’ కి ఇంకా బాకీ ఉన్న పవన్ కళ్యాణ్!?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తో చేస్తున్న భారీ చిత్రం “ఓజి” కూడా ఒకటి. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా మేకర్స్ రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ తన పోర్షన్స్ వరకు షూటింగ్ ని పూర్తి చేసేశారని వెల్లడించారు.

కానీ లేటెస్ట్ టాక్ ఏమిటంటే పవన్ ఇంకా “ఓజి”లకి బాకీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ముంబైలో ఒక మూడు రోజులు పాటు జరగనున్న షూటింగ్ కోసం మేకర్స్ సిద్ధం అవుతుండగా అక్కడ షూటింగ్ లో కొంతమేర పవన్ పై సన్నివేశాలు తెరకెక్కించనున్నారట. ఇవి కూడా అయితే పవన్ పూర్తి చేసేసినట్టే అని సమాచారం. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version