‘కన్నప్ప’ ట్రైలర్ రిలీజ్ వాయిదా.. విమాన ప్రమాదమే కారణం!

టాలీవుడ్ ప్రెస్టీజియస్ చిత్రం ‘కన్నప్ప’ ట్రైలర్ కోసం ప్రేక్షకులు రెడీ అవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 13న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించడంతో ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుందా.. ఈ ట్రైలర్‌కు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ ట్రైలర్ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు హీరో విష్ణు మంచు పేర్కొన్నాడు.

తాజాగా అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ భారతదేశ ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ విమానంలో 240కి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వార్తల కోసం ప్రజలు చూస్తున్నారు. ఇలాంటి బాధాకర సమయంలో తమ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి వేడుక జరుపుకోలేమని.. తమ చిత్ర ట్రైలర్‌ను ఒక రోజు వెనక్కి వాయిదా వేస్తున్నట్లు మంచు విష్ణు పేర్కొన్నాడు.

ఇక ఈ సినిమాలో పలువురు పాన్ ఇండియా స్టార్స్ నటిస్తుండగా వారిలో.. మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. జూన్ 27న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version