పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బీజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని రిలీజ్కు రెడీ చేసిన పవన్, ఆ తర్వాత ‘ఓజి’ సినిమాను కూడా సిద్ధం చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్లో ‘ఉస్తాద్ భగత్సింగ్’ చిత్రంలో నటిస్తున్నాడు.
ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ముగించాక పవన్ సినిమాలకు గుడ్ బై చెబుతాడనే వార్త సినీ వర్గాలతో పాటు అభిమానుల్లో కూడా కొంతవరకు వినిపిస్తుంది. అయితే, ఈ మూడు సినిమాల తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తాడని తెలుస్తోంది. కానీ, ‘హరిహర వీరమల్లు పార్ట్ 2’తో పవన్ సినిమాలకు బ్రేక్ ఇస్తాడనేది మరో టాక్. అయితే, ఇప్పుడు ఇవన్నీ కాకుండా పవన్ గతంలో మొదలుపెట్టిన ఓ సినిమా హాట్ టాపిక్గా మారింది.
స్టైలిష్ డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి గతంలో పవన్తో ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. శ్రీరామ్ తాళ్లూరి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. ఇక ఇప్పుడు ఈ సినిమా మరోసారి లైమ్లైట్లోకి వచ్చింది. ఇటీవల సురేందర్ రెడ్డి పవన్ను కలిశాడని.. స్క్రిప్ట్ పూర్తిగా రెడీగా ఉందని ఆయన తెలిపాడట. మరి పవన్ సురేందర్ రెడ్డితో సినిమాకు ఇప్పుడు ఓకే చెబుతాడా లేదా.. అనేది వేచి చూడాలి.