కరోనాతో.. పవన్ సినిమా ప్లాన్ మారింది !

కరోనాతో.. పవన్ సినిమా ప్లాన్ మారింది !

Published on Apr 14, 2020 10:13 AM IST

విజువల్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తోన్న చిత్రంలో కరోనా కారణంగా ఒక పెద్ద మార్పు చేయబోతున్నారు. మొదట ఈ సినిమా క్లైమాక్స్ ను మొరాకోలో భారీ సెట్లలో భారీ స్థాయిలో చిత్రీకరించాలని క్రిష్ ప్లాన్ చేశాడు. కానీ కరోనా దెబ్బకు ఇప్పుడు ఆ ప్లాన్ అంతా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే సెట్స్ వేసి క్లైమాక్స్ ను షూట్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా క్లైమాక్స్ సెట్స్ కి సబంధించి గ్రౌండ్ వర్క్ ను ప్రారంభించారట.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించబోతుంది. ఈ చిత్రంలో ఆమె యువరాణిగా.. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో రాబోతున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ పేరున్న ఓ రాజుకి సోదరి పాత్రలో నటించబోతుందట. అలాగే పవన్ ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వస్తున్నాయి.

అన్నట్టు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారట. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ వెలువడలేదు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు