సీరియస్ అయిన పవన్ హీరోయిన్

సీరియస్ అయిన పవన్ హీరోయిన్

Published on Jun 18, 2020 3:00 AM IST

సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో బాలీవుడ్ లో పెద్ద వివాదమే రగిలింది. సుశాంత్ పట్ల బాలీవుడ్ పెద్దలు ప్రవర్తించిన తీరును తాప్సి, పూనమ్, శ్రద్ధాదాస్, పాయల్, కంగనా లాంటి హీరోయిన్లు తప్పుపట్టారు. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరోయిన్ నికీషా పటేల్ కూడా చేరిపోయింది.ఆమె మాట్లాడుతూ “నాది ఒకే ఒక్క ప్రశ్న. సుశాంత్ సింగ్ అంత్యక్రియలకు బాలీవుడ్ బిగ్ షాట్స్ నుంచి ఒక్కరు కూడా ఎందుకు హాజరవ్వలేదు. లంచ్ చేస్తూ బిజీగా ఉన్నారా. మానవత్వం ఎక్కడుంది.” సూటిగా ప్రశ్నించారు.

తెలుగులో పవన్ హీరోగా వచ్చిన కొమరం పులి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్ పెద్దలను గట్టిగానే నిలదీసింది.

ఇలా సింపుల్ స్టేట్ మెంట్ తో బాలీవుడ్ ను కడిగి పారేసింది నికీషా పటేల్. నిజమే సుశాంత్ అంత్యక్రియలకు బాలీవుడ్ ప్రముఖులు డుమ్మా కొట్టారు. ఇక్కడ లాక్ డౌన్ అంటూ సాకు చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే.. ఇదే లాక్ డౌన్ టైమ్ లో కన్నుమూసిన రిషీకపూర్కు, ఇర్ఫాన్ ఖాన్ వంటివారికి నివాళులు అర్పించడానికి బాలీవుడ్ ప్రముఖులు రావడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు