‘ఓజి’ విలన్ కి వచ్చింది కరోనా కాదు.. మళ్ళీ బరిలోకి.. అసలేమైందంటే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమాపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్ చేసుకోగా హీరో పవన్ కళ్యాణ్ పోర్షన్స్ కూడా కంప్లీట్ అయ్యినట్టు మేకర్స్ చెప్పారు. ఇక ఈ సినిమా విలన్ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఆ మధ్య కరోనా వచ్చిన కారణంగా షూటింగ్ కి దూరం అయ్యినట్టుగా వార్తలొచ్చాయి.

అయితే అసలు దీనిపై క్లారిటీ ఇపుడు బయటకి వచ్చింది. నిజానికి ఇమ్రాన్ కి వచ్చింది కరోనా కాదట. తనకి డెంగ్యూ రావడం మూలానే షూటింగ్ కి దూరం అయ్యినట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం తాను మొత్తం రికవర్ అయ్యి ఫైనల్ గా షూటింగ్ కోసం సిద్ధం అయ్యారట. ఇలా ప్రస్తుతం ఓజి సెట్స్ లోనే తాను జాయిన్ అయ్యినట్టుగా తెలుస్తుంది. సో ఇమ్రాన్ విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి.

Exit mobile version