టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కొత్త చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్నాడు.
ఇక ఈ సినిమా షూటింగ్ నుంచి మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ కర్ణాటకలో జరుగుతోంది. అయితే, ఇప్పుడు ఎన్టీఆర్-నీల్ మూవీ తొలి షెడ్యూల్ ముగించుకుందని చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ షెడ్యూల్లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్త మేకోవర్తో కనిపించబోతున్నాడట. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుందనే టాక్ వినిపిస్తోంది.