మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీని స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే, ఎన్టీఆర్ లేని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.
కాగా, ఈ సినిమాను హొంబాలే ఫిలింస్ అత్యంత భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేయనుందిన గతంలోనే వెల్లడించారు. అయితే, తాజాగా ఈ మూవీ బడ్జెట్ వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా రూ.400 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించినట్లుగా తెలుస్తోంది.
ఇంతటి భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నెవర్ బిఫోర్ పాత్రలో కనిపించబోతున్నాడని.. ఆయన పాత్రను ప్రశాంత్ నీల్ ఎలివేట్ చేసే విధానం నెక్స్ట్ లెవెల్లో ఉండనుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ప్రస్తుతం ‘వార్-2’ షూటింగ్ను ముగించే పనిలో ఉన్న ఎన్టీఆర్ మార్చి నెలలో ప్రశాంత్ నీల్ మూవీలో జాయిన్ అవుతాడని తెలుస్తోంది.