ఈ సారి రీమేక్ ప్లాన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తోందో ?

ఈ సారి రీమేక్ ప్లాన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తోందో ?

Published on Mar 24, 2020 1:00 AM IST

నేచురల్ స్టార్ నాని నటించిన క్లాస్ మూవీ ‘జెర్సీ’ హిందీలో కూడా భారీ స్థాయిలోనే రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్‌ ఠాకూర్‌ కనిపించనుంది. కాగా తాజాగా బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే చాల భాగం రెగ్యులర్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లైమాక్స్ అండ్ కొన్ని సన్నివేశాలను ఈ నెల చివరి వారంలో చండీగఢ్ లో షూట్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా ఎఫెక్ట్ కారణంగా షూట్ పోస్ట్ ఫోన్ అయింది.

అన్నట్టు చండీగఢ్ లోని లొకేషన్స్ సినిమాలోని సీన్స్ కి బాగా సూట్ అవుతాయని.. ముఖ్యంగా లవ్ స్టోరీకి సంబంధించిన సీన్స్ అన్ని అక్కడే షూట్ చేయాలని చూస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గాక షూటింగ్ ఉంటుంది. ఇక ఇప్పటికే షాహిద్ క్రికెటర్ పాత్ర కోసం ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. షాహిద్ కపూర్ ఇంతకుముందే తెలుగు చిత్రం ‘అర్జున్ రెడ్డి’ని హిందీలోకి ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి భారీ హిట్ అందుకొన్నారు. ఇప్పుడు కూడా అదే రీమేక్ ఫార్ములాను ఫాలో అవుతూ చేస్తున్న ఈ సినిమా మీద హిందీ ప్రేక్షకుల్లో కూడా అమితాశక్తి నెలకొని ఉంది. మరి ఈ సారి షాహిద్ కి ఈ రీమేక్ ప్లాన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తోందో చూడాలి.

ఇక తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ వర్షన్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగష్టు 28వ తేదీన చిత్రం విడుదలకానుంది. అయితే తెలుగు జెర్సీలో కొన్ని మార్పులు చేసి హిందీలోకి తెరకెక్కిస్తున్నారు. మెయిన్ గా హీరో కొడుకు పాత్రను కొత్తగా రాసినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు