బాలయ్య బాబు ప్రస్తుతం వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి చిత్రాలతో వరుస హిట్లు అందుకుని ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో ‘అఖండ-2’ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు, గోపీచంద్ మలినేని, బాలయ్యతో మరో మూవీ చేసేందుకు రెడీ అయ్యాడు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు దీనిని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గోపీచంద్ మలినేని తాజాగా ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.
‘‘గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్.. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉండనుంది. బాలకృష్ణతో కలిసి మరోసారి వర్క్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం కానుంది’’ అని తన పోస్ట్ లో పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ నటించనున్న 111 ప్రాజెక్ట్ ఇది. ఇక బోయపాటి దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమా అఖండ 2. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల తేదీని టీమ్ ప్రకటించింది. రేపు సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేయనున్నట్లు చెప్పింది.