ఎట్టకేలకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి మొదలైన లేటెస్ట్ ప్రాజెక్ట్ “సర్కారు వారి పాట”. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి ఓ అంశంపై పలు ఊహాగానాలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ చిత్రంలో మహేష్ సరసన హీరోయిన్ గా ఎవరు చేస్తారు అన్నది కాస్త హాట్ టాపిక్ అవుతుంది. మొదట తన హిట్ పెయిర్ కియారా అద్వానీ పేరు వినిపించింది. తర్వాత ఓ కొత్త నటి ఉంటుందని కూడా వినిపించింది. కానీ ఇప్పుడు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పేరు కూడా వినిపిస్తుంది.
మరి ఇది ఎంత వరకు నిజమో తెలియ రావాల్సి ఉంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు మరియు 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.