టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ‘కుబేర’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న లీడ్ రోల్స్లో నటించారు. ఎమోషనల్ కంటెంట్గా రూపొందిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమాకు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ రెస్పాన్స్ లభించడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. అయితే, తమిళనాట ఈ చిత్రానికి చేదు అనుభవం ఎదురయ్యింది. ధనుష్ లాంటి యాక్టర్ ఉన్నా కూడా ఈ సినిమాను అక్కడి ప్రేక్షకులు తిరస్కరించారు. దీంతో ఈ సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయింది.
ఈ ఫెయిల్యూర్కు గల కారణాలేమిటో పరిశీలించాలని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. ఈ సినిమా కథ, అందులోనూ ధనుష్ ఉండటంతో ఈ సినిమా అక్కడి వారికి ఈజీగా కనెక్ట్ అవుతుందని భావించామని.. అయితే, ఇప్పుడు ఫలితం చూసి తాము ఏ విషయంలో తప్పు చేశామో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆయన అన్నారు.