ప్రముఖ నటుడికి మాతృవియోగం !

ప్రముఖ నటుడికి మాతృవియోగం !

Published on Jun 8, 2020 2:37 PM IST

ప్రముఖ టాలీవుడ్ నటులు శ్రీ మురళి శర్మ గారికి మాతృవియోగం కలిగింది. ఆయన మాతృ మూర్తి శ్రీమతి పద్మ శర్మ గారు గత రాత్రి ముంబైలోని స్వగృహంలో గుండె పోటుతో ఆకస్మిక మృతి చెందారు. ఆమె వయస్సు 76 సంవత్సరాలు, వయసు పై బడటం కారణంగా ఆమె గత కొంతకాలంగా అనారోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు.

పద్మ శర్మ గారిది తెలుగు కుటుంబమే. పద్మ అమ్మగారిది గుంటూరు, ఆమె కూడా అక్కడే పుట్టి పెరిగారు. పెళ్ళయాక భర్త వృజు భూషణ్ వ్యాపారరీత్యా ముంబాయిలో స్థిరపడ్డారు. మురళి శర్మ అక్కడే పుట్టి పెరిగాడు. అక్కడే చదువుకొన్నాడు. ఆయనకు తల్లి అంటే అపారమైన ప్రేమ.

123తెలుగు.కామ్ తరఫున శ్రీమతి పద్మ శర్మ గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు