అవయవదానం చేస్తున్నట్టు ప్రతిజ్ఞ చేసిన అమల

అవయవదానం చేస్తున్నట్టు ప్రతిజ్ఞ చేసిన అమల

Published on Jan 27, 2012 11:41 PM IST

నాగార్జున గారి భార్య అమల అక్కినేని తన అవయవాలను దానం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసారు. జనవరి 26న ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ లో జరిగిన ఒక కార్యక్రమం లో ఈ ప్రతిజ్ఞ చేసారు. అరవింద్ కృష్ణ నటించిన “రుషి” చిత్ర ప్రచారం ఓ భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అవయవ దానం మీద అవగాహన ఉద్దేశంగా ఏర్పాటు చేసారు ఈ కార్యక్రమానికి అమల ముఖ్య అతిధి గ హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో అమల మాట్లాడుతూ ” చాలా మంది మనం ఒకేసారి బతుకుతం ఒకేసారి చనిపోతం అని నమ్ముతుంటారు ఇలాంటి కార్ర్యక్రమం లో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది” అన్నారు. అరవింద్ కృష్ణ, రాజ్ ముదిరాజ్ మరియు రమేష్ ప్రసాద్ లు కూడా అవయవదానం చేస్తున్నట్టు ప్రకటించారు.

తాజా వార్తలు