విక్టరీ వెంకటేష్ మరియు మహేష్ బాబు నటిస్తున్న మల్టి స్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో వెంకీ సరసన అమలా పాల్ నటించబోతున్నట్లు తాజా సమాచారం. వెంకీ మరియు మహేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నారు. వెంకీ భార్య పాత్ర కోసం చాలా మంది హీరోయిన్సును సంప్రదించగా చివరికి అమలా పాల్ ఓకే చేసినట్లు సమాచారం. దీని గురించి అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం. చాలా రోజుల తర్వాత తెలుగులో వస్తున్న మల్టి స్టారర్ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించబోతున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం ప్రారంభం కానున్న ఈ చిత్రంలో వెంకీ-మహేష్ కి తండ్రిగా ప్రకాష్ రాజ్ చేయబోతున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!