మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు ‘కళ్యాణ్ దేవ్’ హీరోగా, రచయిత ‘శ్రీధర్ సీపాన’ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ పట్ల వైష్ణవ్ తేజ్ చాలా ఇంప్రెస్ అయ్యారు. అందుకే కథలో మరింత ఆకర్షణీయంగా కనబడటం కోసం లుక్ మార్చుకుంటున్నాడట. లాక్ డౌన్ తో వచ్చిన ఖాళీ సమయంలో ఇప్పటికే బరువు తగ్గే వర్కవుట్స్ మొదలుపెట్టాడట. అందుకోసం ఆర్గానిక్ థెరపీ ఫాలో అవుతున్నట్లు సమాచారం. కరోనా లాక్ డౌన్ పీరియడ్ ముగియగానే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇందులో దేవ్ సరసన అవికా ఘోర్ కథానాయకిగా నటిస్తుందని తెలుస్తోంది.
అయితే ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు గురించి ఇంకా తెలియాల్సి ఉంది. ‘జిఏ 2 పిక్చర్స్’ సమర్పణలో నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూలరంగడు, భీమవరం బుల్లోడు, లౌక్యం వంటి పలు హిట్ చిత్రాలకు కథ, మాటలు అందించిన ‘శ్రీధర్ సీపాన’ మరి ఈ చిత్రం కోసం ఎలాంటి కథాకథనాలను రాశాడో చూడాలి.
ప్రస్తుతం ‘కళ్యాణ్ దేవ్’ నూతన దర్శకుడు పులి వాసు దర్శకత్వంలో తన రెండువ సినిమాని చేస్తున్నాడు. ఈ చిత్రం రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.