క్రిమిని కాదు ప్రేమని పంచుతాం అంటున్న మెగా ఫ్యామిలీ

క్రిమిని కాదు ప్రేమని పంచుతాం అంటున్న మెగా ఫ్యామిలీ

Published on Apr 15, 2020 11:15 AM IST

కరోనా ని కట్టడి చేసే కార్యక్రమంలో భాగంగా ప్రజలలో అవగాహన కల్పించడానికి మెగా ఫ్యామిలీ మొత్తం ఏకమయ్యారు. ప్లకార్స్ పట్టుకొని సామాజిక సందేశం అందించారు. ఇంట్లో ఉంటూ యుద్ధం చేస్తాం….క్రిమిని కాదు ప్రేమను పంచుతాం…కాలు కదపకుండా కరోనాని తరిమేస్తాం…భారతీయులం ఒక్కటై భారత్ ని గెలిపిస్తాం” అనే సందేశం తో కూడిన ప్లకార్డులతో దిగిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు, చరణ్, అల్లు అరవింద్, నాగ బాబు, వరుణ్, నిహారిక, ధరమ్ ఇంకా చిరు ఫ్యామిలీకి చెందిన పలువురు ఈ ప్లకార్డులు ప్రదర్సించారు.

రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతుంది. దేశంతో పాటు తెలుగు రాష్ట్రాలలో దీని వ్యాప్తి అధికంగా ఉంది. అందుకే ప్రజల్లో అవగాహన కల్పించి ఈ వైరస్ ని కట్టడి చేయడం కోసం మెగా ఫ్యామిలీ ఇలా వినూత్నంగా ప్రచారం చేశారు. ఈ ఫోటోని చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయడంతో పాటు, కలిసి కట్టుగా మాత్రమే ఈ యుద్దాన్ని ఎదుర్కోగలం,మీకోసం మరియు భావితరాల కోసం ఇంటికే పరిమితం అవ్వండి అని ఆయన సందేశం ఇచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు