వీర సైనికులకు మహేష్ సెల్యూట్..!

నిన్న లఢక్ లోని గాల్వన్ వ్యాలీ ప్రాంతంలో ఇండియా మరియు చైనా సైనికుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బోర్డర్ వివాదంలో చైనా మరియు ఇండియా సైనికులు పరస్పరం దాడికి దిగడం జరిగింది. ఈ దాడిలో భారత సైన్యానికి చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20మంది సైనికులు ప్రాణాలు వదిలారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆ వీర సైనికుల త్యాగాలను ప్రజలు కొనియాడుతున్నారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నారు.

కాగా హీరో మహేష్ ఈ పోరులో సైనికులు ప్రాణాలు కోల్పోయినందుకు విచారం వ్యక్తం చేశారు. మీరు ఎప్పటికీ మా గుండెల్లో ఉంటారన్న మహేష్, మీ త్యాగానికి, దేశభక్తికి మా సెల్యూట్ అని చెప్పారు. ఆ సైనికుల కుటుంబాలకు ధైర్యం ప్రసాదించాలని కోరుకున్నారు. ఇక మహేష్ గత చిత్రం సరిలేరు నీకెవ్వరు మూవీలో మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ రోల్ చేశారు.

Exit mobile version