లాక్ డౌన్ లో మహేష్ మరియు ఆయన కుటుంబ సభ్యులు తమ సరదాలు, వ్యాపకాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పంచుకుంటూ ఫ్యాన్స్ కి సరదా అందిస్తున్నారు. ఇక మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ సితార మరియు గౌతమ్ వీడియోలు మరియు ఫోటోలు వరుసగా షేర్ చేస్తున్నారు. నేడు నమ్రత చిట్టి సితార తన బేబీ డాల్ తో ఆడుకోవడం అలాగే ఆ బొమ్మను నిద్రపుచ్చడానికి పాటలు పాడుతున్న వీడియో షేర్ చేశారు.
మరో వీడియోలో సితార తన ఫ్రెండ్ తారతో కలిసి కోచ్ సమక్షంలో వార్మ్ అప్ చేస్తుంది. ఈ రెండు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మహేష్ దర్శకుడు పరుశురామ్ తో సర్కారు వారి పాట మూవీ ప్రకటించగా సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.