‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ మళ్ళీ బాలీవుడ్ హీరోతోనే ?

‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ మళ్ళీ బాలీవుడ్ హీరోతోనే ?

Published on Apr 28, 2020 8:13 AM IST

‘అర్జున్ రెడ్డి’ అనే బోల్డ్ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు స్టార్ డమ్ ను కూడా సంపాదించుకున్నాడు యంగ్ డైరెక్టర్ సందీప్ వంగ. పైగా ఈ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ అనే టైటిల్ తో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ బ్లాక్ బస్టర్ కొట్టి ఏకంగా బాలీవుడ్ లోనే టాప్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకడిగా మారిపోయాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మరో వైవిద్యమైన చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసే పనిలో పడ్డాడు. అయితే సందీప్ ఈ సారి కూడా బాలీవుడ్ హీరోతోనే తన తరువాత సినిమాని ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తో ఓ యాక్షన్ క్రైమ్ డ్రామాను ప్లాన్ చేస్తున్నాడట.

కాగా హిందీ నిర్మాతలు సందీప్ వంగ సినిమాల కోసం ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి ముందుకొస్తున్నారట. ‘కబీర్ సింగ్’ సినిమా నిర్మాత టీ-సిరీస్ భూషణ్ కుమార్, సినీ 1 స్టూడియోస్ మురాద్ ఖేతాని కలిసి సందీప్ వంగ తర్వాతి చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. వీరితోపాటే సందీప్ వంగ అన్నయ్య ‘అర్జున్ రెడ్డి’ నిర్మాత ప్రణయ్ వంగ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకోనున్నారు. మొత్తానికి మొదటి సినిమా ఛాన్స్ కోసం సంవత్సరాలు తరబడి తిరిగాడు. కానీ, ఇప్పుడు అడగకుండానే స్టార్ ప్రొడ్యూసర్స్ సైతం సినిమా అవకాశాలు ఇస్తున్నారు. అందుకే తన తరువాత సినిమాని కూడా పాన్ ఇండియా సినిమానే ప్లాన్ చేస్తున్నాడు. మరి సందీప్ వంగ బాలీవుడ్ లో తన సక్సెస్ ను ఇలాగే కొనసాగించాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు